పరుచూరి హనుమంతరావు ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు.
జీవిత విశేషాలు:
కృష్టా జిల్లా దివిసీమ లో ఘంటసాల మండలానికి చెందిన చిట్టూర్పు గ్రామంలో పేద రైతు కుటుంబంలో పుట్టారు.కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేశారు. వూరూరా తిరిగి ప్రదర్శనలిచ్చి రాజకీయ ప్రచారం చేశారు.తెలంగాణా రైతాంగసాయుధ పోరాటంలో జైలుకు వెళ్లారు.కడలూరు జైలులో ఎ.కె.గోపాలన్ , మోటూరు హనుమంతరావు తదితర కమ్యూనిస్టు యోధులతో కలసి శిక్ష అనుభవించారు. మద్రాసు పచ్చయప్ప కాలేజీ లో బిఎ చదువుతూ విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. విశాలాంధ్ర పత్రికలోనూ కొంత కాలం విలేకరిగా పనిచేశారు. 1962 తర్వాత చలన చిత్ర రంగంలో తాపీ చాణక్య వంటి దర్శకుల దగ్గర పనిచేశారు. మహాకవి శ్రీశ్రీ కి సన్నిహితంగా మెలిగారు. ఆ రోజుల్లో నటించడానికి ఎవరూ ముందుకు రాకపోతే ప్రకటనలిచ్చి ఇంటర్వ్లూలు జరిపి మరీ తీసుకొచ్చారు. ముడిఫిల్ము కొరత సినిమా పరిశ్రమను సంక్షుభితం చేసిన దశలో ఆయన దృష్టి ముద్రణా రంగం వైపు మరలింది. ఆరు వేల పెట్టుబడితో పాత యంత్రాలతో అచ్చుపని మొదలెట్టారు.ఒక సెకండ్ హాండ్ ఆఫ్సెట్ యంత్రం కొన్నారు.హనుమంతరావు కుమారులు నరేంద్ర మహేంద్ర ప్రగతి సంస్థను సాంకేతికంగా అభివృద్ధి పరిచారు.1979లో వారు దక్షిణ భారత దేశంలోనే తొలి సారి ఫోటో కంపోజింగు విధానాన్ని ప్రవేశపెట్టారు.మనుమళ్ళు హర్ష, హేమంత్లు కూడా ఈ బృందంలో భాగస్వాములయ్యారు.అయిదు రంగుల ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. 1996లో స్పాట్ యువి కోటింగ్స్ కూడా అలాగే ప్రథమ పర్యాయం మొదలైంది.
జీవిత విశేషాలు:
కృష్టా జిల్లా దివిసీమ లో ఘంటసాల మండలానికి చెందిన చిట్టూర్పు గ్రామంలో పేద రైతు కుటుంబంలో పుట్టారు.కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేశారు. వూరూరా తిరిగి ప్రదర్శనలిచ్చి రాజకీయ ప్రచారం చేశారు.తెలంగాణా రైతాంగసాయుధ పోరాటంలో జైలుకు వెళ్లారు.కడలూరు జైలులో ఎ.కె.గోపాలన్ , మోటూరు హనుమంతరావు తదితర కమ్యూనిస్టు యోధులతో కలసి శిక్ష అనుభవించారు. మద్రాసు పచ్చయప్ప కాలేజీ లో బిఎ చదువుతూ విద్యార్థి ఉద్యమంలో పనిచేశారు. విశాలాంధ్ర పత్రికలోనూ కొంత కాలం విలేకరిగా పనిచేశారు. 1962 తర్వాత చలన చిత్ర రంగంలో తాపీ చాణక్య వంటి దర్శకుల దగ్గర పనిచేశారు. మహాకవి శ్రీశ్రీ కి సన్నిహితంగా మెలిగారు. ఆ రోజుల్లో నటించడానికి ఎవరూ ముందుకు రాకపోతే ప్రకటనలిచ్చి ఇంటర్వ్లూలు జరిపి మరీ తీసుకొచ్చారు. ముడిఫిల్ము కొరత సినిమా పరిశ్రమను సంక్షుభితం చేసిన దశలో ఆయన దృష్టి ముద్రణా రంగం వైపు మరలింది. ఆరు వేల పెట్టుబడితో పాత యంత్రాలతో అచ్చుపని మొదలెట్టారు.ఒక సెకండ్ హాండ్ ఆఫ్సెట్ యంత్రం కొన్నారు.హనుమంతరావు కుమారులు నరేంద్ర మహేంద్ర ప్రగతి సంస్థను సాంకేతికంగా అభివృద్ధి పరిచారు.1979లో వారు దక్షిణ భారత దేశంలోనే తొలి సారి ఫోటో కంపోజింగు విధానాన్ని ప్రవేశపెట్టారు.మనుమళ్ళు హర్ష, హేమంత్లు కూడా ఈ బృందంలో భాగస్వాములయ్యారు.అయిదు రంగుల ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. 1996లో స్పాట్ యువి కోటింగ్స్ కూడా అలాగే ప్రథమ పర్యాయం మొదలైంది.
No comments:
Post a Comment