బొమ్మగాని ధర్మబిక్షం ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు. ఈయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోకసభ నియోజకవర్గం ఎమ్.పి.గా 10, 11వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఈయన నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట మండలం సూర్యాపేట గ్రామంలోని పేద వ్యవసాయ కుటుంబంలో 15 ఫిబ్రవరి 1922లో జన్మించారు. ఈయన తండ్రి పేరు ముత్తిలింగం. వారి తండ్రి చిన్నవయస్సులో మునుగోడు మండలం ఊకొండి నుండి సూర్యాపేటకు వచ్చి స్థిరపడ్డారు.
విద్యార్థి జీవితం:
ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండల్లో పని చేశారు. నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్త్టె ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు.
చదువు:
మెట్రిక్యులేషన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సూర్యాపేట.
అలిగ్రా యూనివర్సటీ కోర్స్, సూర్యాపేట.
రాజకీయ జీవితం
స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ కు సూర్యాపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు 1957లో నకిరేకల్ నుండి, 1962లో నల్గొండ నుండి ప్రాతినిథ్యం వహించారు. 1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. గీత పనివారల సంఘం నేతృత్వంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరివరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
పదవులు
1.1951-73లో కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) జిల్లా మండలి, నల్గొండ.
2.1952-57లో శాసనసభ్యులు, హైదరబాద్ శాసనసభ (
3.1957-62, 1962-67 శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.
4.1972 నుంచి కార్యవర్గ సభ్యులు, సిపిఐ, ఆంధ్రప్రదేశ్.
5.1991లో 10వ లోక్ సభ స్థానానికి ఎన్నిక.
6.1991-96 సభ్యులు, సంప్రదింపుల కమిటీ, గ్రామీణాభివృద్ధి శాఖ.
7.1992-95 కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర సమితి, సిపిఐ, ఆంధ్రప్రదేశ్
8.1996 లో 11వ లోక్ సభ స్థానానికి రెండవసారి ఎన్నిక
9. సభ్యులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ), జాతీయ మండలి.
విద్యార్థి జీవితం:
ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పని చేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండల్లో పని చేశారు. నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్త్టె ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు.
చదువు:
మెట్రిక్యులేషన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సూర్యాపేట.
అలిగ్రా యూనివర్సటీ కోర్స్, సూర్యాపేట.
రాజకీయ జీవితం
స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ కు సూర్యాపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు 1957లో నకిరేకల్ నుండి, 1962లో నల్గొండ నుండి ప్రాతినిథ్యం వహించారు. 1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. గీత పనివారల సంఘం నేతృత్వంలో గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరివరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
పదవులు
1.1951-73లో కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) జిల్లా మండలి, నల్గొండ.
2.1952-57లో శాసనసభ్యులు, హైదరబాద్ శాసనసభ (
3.1957-62, 1962-67 శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.
4.1972 నుంచి కార్యవర్గ సభ్యులు, సిపిఐ, ఆంధ్రప్రదేశ్.
5.1991లో 10వ లోక్ సభ స్థానానికి ఎన్నిక.
6.1991-96 సభ్యులు, సంప్రదింపుల కమిటీ, గ్రామీణాభివృద్ధి శాఖ.
7.1992-95 కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర సమితి, సిపిఐ, ఆంధ్రప్రదేశ్
8.1996 లో 11వ లోక్ సభ స్థానానికి రెండవసారి ఎన్నిక
9. సభ్యులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ), జాతీయ మండలి.
No comments:
Post a Comment