ఆధునిక తెలంగాణ- కాలరేఖ:
1948, సెప్టెంబర్ 13 ఆపరేషన్ పోలోలో భాగంగా భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
1948, సెప్టెంబరు 17: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది.
1948, ఆగస్టు 22: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది.
1953, ఆగస్టు 25: తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణించాడు.
1955, డిసెంబరు 10: నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.
1956, ఫిబ్రవరి 20: తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.
1956, నవంబరు 1: తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో భాగమైంది.
1961, ఫిబ్రవరి 6: తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు.
1963,జూలై 26: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
1967, ఫిబ్రవరి 24: హైదరాబాదు రాజ్యపు చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ మరణించాడు.
1967, ఏప్రిల్ 11: హైదరాబాదు లో ఈసీఐఎల్ స్థాపించబడింది.
1967, ఆగస్టు 4: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభించబడింది.
1969, ఫిబ్రవరి 28: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు.
1969, మార్చి 29: ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
1970, జూలై 24: తెలంగాణ పితామహుడిగా పేరుపొందినకొండా వెంకట రంగారెడ్డి మరణించాడు.
1971, సెప్టెంబరు 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవి చేపట్టాడు.
1973, డిసెంబరు 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిలోకి వచ్చాడు.
1976, మార్చి 31: ప్రముఖ తెలంగాణ సాయుధపోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి మరణించాడు.
1976, సెప్టెంబరు 24: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు పండిత్ నరేంద్రజీ మరణించాడు.
1976, మే 12: ప్రముఖ సమరయోధుడు, రచయిత, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు మరణించాడు.
1978: ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి పదవిలోకి వచ్చాడు.
1978, ఆగస్టు 15: హైదరాబాదు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడింది.
1991, జూన్ 21: తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు.
2000, మార్చి 7: హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ల దురాగతాలకు బలయ్యాడు.
2007, ఏప్రిల్ 16: హైదరాబాదు నగరపాలక సంస్థ స్థానంలో "గ్రేటర్ హైదరాబాదు"(హైదరాబాదు మహానగరపాలక సంస్థ) ఏర్పడింది.
2008, మార్చి 15: రంగారెడ్డి జిల్లా శంషాబాదులో అంతర్జాతీయ విమానాశయం ప్రారంభించబడింది.
2009, అక్టోబరు 19: దేశంలోనే అతిపొడవైన ఫైఓవర్ (పి.వి.నరసింహారావు ఎక్స్ప్రెస్ వే) హైదరాబాదులో ప్రారంభమైంది.
2009, నవంబరు 29: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది.
2009, డిసెంబరు 9: భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు.
2011, మార్చి 10: ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్బండ్పై మిలియన్ మార్చ్ ఉద్యమం నిర్వహించబడింది.
2013, జూలై 30: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది.
2013, అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
2013, డిసెంబరు 5: తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది.
2014, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
2014, ఫిబ్రవరి 13: తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడినది.
2014, ఫిబ్రవరి 18: లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది.
2014, ఫిబ్రవరి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
2014, మార్చి 1: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది.
2014, మార్చి 4: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
2014, జూన్ 2: భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
1948, సెప్టెంబర్ 13 ఆపరేషన్ పోలోలో భాగంగా భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
1948, సెప్టెంబరు 17: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది.
1948, ఆగస్టు 22: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది.
1953, ఆగస్టు 25: తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణించాడు.
1955, డిసెంబరు 10: నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.
1956, ఫిబ్రవరి 20: తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.
1956, నవంబరు 1: తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో భాగమైంది.
1961, ఫిబ్రవరి 6: తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు.
1963,జూలై 26: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
1967, ఫిబ్రవరి 24: హైదరాబాదు రాజ్యపు చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ మరణించాడు.
1967, ఏప్రిల్ 11: హైదరాబాదు లో ఈసీఐఎల్ స్థాపించబడింది.
1967, ఆగస్టు 4: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభించబడింది.
1969, ఫిబ్రవరి 28: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు.
1969, మార్చి 29: ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
1970, జూలై 24: తెలంగాణ పితామహుడిగా పేరుపొందినకొండా వెంకట రంగారెడ్డి మరణించాడు.
1971, సెప్టెంబరు 30: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవి చేపట్టాడు.
1973, డిసెంబరు 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిలోకి వచ్చాడు.
1976, మార్చి 31: ప్రముఖ తెలంగాణ సాయుధపోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి మరణించాడు.
1976, సెప్టెంబరు 24: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు పండిత్ నరేంద్రజీ మరణించాడు.
1976, మే 12: ప్రముఖ సమరయోధుడు, రచయిత, రాజకీయ నాయకుడు మందుముల నరసింగరావు మరణించాడు.
1978: ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి పదవిలోకి వచ్చాడు.
1978, ఆగస్టు 15: హైదరాబాదు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడింది.
1991, జూన్ 21: తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు.
2000, మార్చి 7: హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి నక్సలైట్ల దురాగతాలకు బలయ్యాడు.
2007, ఏప్రిల్ 16: హైదరాబాదు నగరపాలక సంస్థ స్థానంలో "గ్రేటర్ హైదరాబాదు"(హైదరాబాదు మహానగరపాలక సంస్థ) ఏర్పడింది.
2008, మార్చి 15: రంగారెడ్డి జిల్లా శంషాబాదులో అంతర్జాతీయ విమానాశయం ప్రారంభించబడింది.
2009, అక్టోబరు 19: దేశంలోనే అతిపొడవైన ఫైఓవర్ (పి.వి.నరసింహారావు ఎక్స్ప్రెస్ వే) హైదరాబాదులో ప్రారంభమైంది.
2009, నవంబరు 29: ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది.
2009, డిసెంబరు 9: భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు.
2011, మార్చి 10: ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్బండ్పై మిలియన్ మార్చ్ ఉద్యమం నిర్వహించబడింది.
2013, జూలై 30: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది.
2013, అక్టోబరు 3: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
2013, డిసెంబరు 5: తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది.
2014, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
2014, ఫిబ్రవరి 13: తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడినది.
2014, ఫిబ్రవరి 18: లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది.
2014, ఫిబ్రవరి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
2014, మార్చి 1: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది.
2014, మార్చి 4: ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
2014, జూన్ 2: భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
No comments:
Post a Comment