Sunday, 12 April 2015

తెలంగాణ వన్యప్రాణుల అభయరణ్యాలు:

పాకాల వన్యప్రాణుల అభయారణ్యం:

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు తీరము చుట్టూ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది.ఈ అభయారణ్యం దాదాపు 839 చ.కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది కాకులు దూరని కారడవే అయినా పర్యాటకులకు అనువైనదే. ఇది వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలంను సంరక్షించే కేంద్రంగా విలసిల్లుతోంది. ఈ అభయారణ్యంలో చిరుతపులులు, మానిటర్ బల్లులు, మొసళ్లు, ఎలుగుబంట్లు, హైనాలు, కొండచిలువలు మరియు తోడేళ్ళు వంటి జంతువులు పర్యాటకులకు కన్నుల విందు చేస్తాయి.


పోచారం అభయారణ్యం:

పోచారం వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు కు 115 km (71 mi) దూరంలోనూ, మెదక్ నుండి 15 km (9.3 mi) దూరంలోనూ గల అభయారణ్యం. ఇది 130 చదరపు కి.మీ పరిధిలో వ్యాపించి ఉంది. ఇది హైదరాబాదు నగర పాలకుడు నిజాం యొక్క వేటాడే స్థలం ఆ ఉండేది. అది 20 వ శతాబ్ద ప్రారంభంలో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడినది.1916 నుండి 1922 వరకు అల్లయిర్ గట్లు పోచారం సరస్సు కు యేర్పడిన తరువాత ఈ అభయారణ్యానికి "పోచారం అభయారణ్యం" అని నామకరణం చేశారు.ఇది సందర్శకులకు జీవావరణ కేంద్రంగా ఆకర్షిస్తుంది. ఇది అనేక క్షీరదాలకు మరియు పక్షులకు ముఖ్య ఆవాసంగా నిలిచింది. మెదక్‌ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విహారకేంద్రంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
చరిత్ర:1916-27 ప్రాంతంలో నిజాం ప్రభువు తీరిక సమ యంలో జంతువులను వేటాడేందుకు ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా, మెదక్‌ జిల్లా సరిహద్దులో ఉన్న పోచా రం ప్రాజెక్టు చూట్టూరా వున్న అటవీ ప్రాంతాన్ని షికార్‌ ఘర్‌ పేరుతో అభివృద్ధి పరిచారు. నిజాం పరిపాలన అంతరించి స్వాతంత్య్రం సిద్దించాక 1952 లో పోచారం అభయారణ్యం ఏర్పడిన తర్వాత కూ డా నవాబులు, ఉన్నతాధికారులు సైతం 1990 వరకు పోచారం అభయారణ్యంలో వేటాడటం కోసం అత్యాధునిక ఆయుధాలతో పోచారం అతిథి గృహంలో నివాసం వుంటూ వేటాడేవారు. దీంతో మెదక్‌ జిల్లా అటవీ శాఖ వన్య ప్రాణి విభాగం పరిధిలో మెదక్‌లో డివిజన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పోచారం అభయారణ్యం 13 వేల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది.ఈ అభయారణ్యం పరిధిలో మెదక్‌ జిల్లాలోని మెదక్‌, రామాయంపేట మండలాలు, నిజామాబాద్‌ జిల్లాలో లింగంపేట, తాడ్వాయి, బిక్కనూర్‌, ఎల్లారెడ్డి మండలాలు ఉన్నాయి.

మంజీర వన్యప్రాణుల అభయారణ్యం:

మంజీర వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా యందలి వన్యప్రాణుల అభయారణ్యం.వాస్తవంగా మొదట ఇది మొసళ్ళ సాంచురీ. ప్రస్తుతం సుమారు 70 కంటే ఎక్కువ జాతుల పక్షులు ఇచట సంరక్షింపబడుతున్నాయి. ఇది అంతరించిపోతున్న జాతులు అయిన "మగ్గర్ మొసళ్ళు" కు సంరక్షణా కేంద్రంగా ఉన్నది. ఈ అభయారణ్యమ్లో రిజర్వాయర్ హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంటనగరాలకు త్రాగునీటిని అందుస్తున్నది.

భౌగోళిక స్థితి:మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లాలో కలదు. ఇది హైదరాబాదు నగరానికి వాయువ్య దిశలో 50 కి.మీ దూరమ్లో ఉన్నది. ఈ అభయరణ్యం లో మంజీర నది 36 కి.మీ ఆవరించి ఉంటుంది.ఇచ్చట గల కృత్రిమ రిజర్వాయరు హైదరాబాదు మరియు సికింద్రాబాదు నగరాలకు త్రాగు నీటి వసతిని కల్పిస్తున్నది. ఈ రిజర్వాయర్ తొమ్మిది ద్వీపాలను కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని పుట్టిగడ్డ, బాపనగడ్డ, సంగమడ్డ, కర్ణంగడ్డ. ఈ ద్వీపములు చిత్తడి నేల సరిహద్దులతో నీటి పక్షులకు గూళ్ళు కట్టుకొనే విధంగా ఉపయోగపడుతాయి. అదనంగా పక్షులకు గూళ్ళు కట్టుకొనుటకు దట్టంగా వ్యాపించిన చెట్లు కూద ఉంటాయి.సవన్నా రకకు శాఖాహారం ఈ అభయారణ్యంలో ఉంటుంది. ఈ రిజర్వాయరు మునిగి ఉన్న మొక్కలు మరియు ఆవశ్యక మొక్కలకు తోడ్పడుతుంది. "టైఫా" , "ఇపోమియా" , మరియు "అకాసియా" రకాలైన కొన్ని మొక్కలు నీటిమట్టానికి అంచున మూసివేయబడినట్లు ఉంటాయి. రిజర్వాయరు మరియు నదికి చుట్టూ వ్యవసాయ భూములుంటాయి.

No comments:

Post a Comment