కొలనుపాక జైనమందిరం:
ఈ జైనమందిరం తెలంగాణలో ని ప్రముఖ జైన క్షేత్రము. ఇది వరంగల్ - హైదరాబాదు రహదారిలో హైదరాబాదుకు 65 కి.మీ, ఆలేరు కు సుమారు 6 కి.మీ.ల దూరంలో ఉంది.ఆలయ విశేషాలు:
ఈ ఆలయ ప్రవేశ ద్వారం కోటద్వారాన్ని తలపిస్తుంది.అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మచిత్రకళ అబ్బుర పరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయం చుట్టుపక్కల చెట్లు, ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో నలుగురు తీర్థంకరుల బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.భగవాన్ మహావీర్ విగ్రహం:
మూల విరాట్టుకు కుడివైపున గల గర్భగుడి లో 1.5 మీ. ఎత్తైన మహావీరుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం మరియు అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉన్నది. వేళ్ళు పొడువుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనోహరంగా ఉన్నది. వజ్ర విశేషజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారత దేశంలో మరెక్కడా లేదు.మాణిక్య దేవ ఋషభ దేవ విగ్రహము:
ఈ విగ్రహం మధ్య గర్భగుడిలో మూల నాయక రూపంలో నెలకొని యున్నది. ఇది నలుపు రంగులో శ్రేష్టమైన రత్నంతో నిర్మించబడి యున్నది. 38.5 అంగుళాల వెడల్పు, 34.56 అంగుళాల పొడువు కలిగి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ విగ్రహం. విగ్రహం ఆహార్యము బహు గొప్పగా మలచబడినది. అర్ధ పద్మాసన సిద్దాసనంలో ఉండి ముఖ ముద్ర గాంభీర్యంగా ఉన్నది, కాంతి మండలం గుండ్రంగా ఉన్నది, లలాటం మీద చంద్రుడు, చుబుకం మీద సూర్యుడు, నాభి పై ఆకారం, అరచేతి మీద శంఖం మరియు చక్రం ఉన్నాయి. ఇది భరత చక్రవర్తి నెలకొల్పిన అతి ప్రాచీనమైన విగ్రహం.గొల్లత్తగుడి:
గొల్లత్తగుడి, మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలానికి చెందిన నిర్జన గ్రామము.మండల కేంద్రమైన జడ్చర్ల నుండి పది కిలోమీటర్ల దూరంలో గంగాపూర్, అల్వాన్పల్లి గ్రామాల మధ్యలో ఉన్నది. ఇక్కడ జరిగిన త్రవ్వకాలలో జైన క్షేత్రముతో పాటు ఒక మధ్యయుగపు హిందూ ఆలయం యొక్క శిధిలాలు బయల్పడినది.ఇక్కడ బయల్పడిన మహావీర, పార్శ్వనాథ తదితర జైన శిల్పాలను మహబూబ్ నగర్ జిల్లా మ్యూజియంలోనూ, హైదరాబాదులోని రాష్ట్ర మ్యూజియంలోనూ ప్రదర్శింపబడుతున్నవి. ఇక్కడ బయల్పడిన క్రీ.శ.7-8వ శతాబ్దపు ఇటుకలతో కట్టిన ఆలయం చాలా అరుదైనది. జైనమతానికి చెందిన ఇటుకలతో కట్టిన ఆలయాల్లో శిల్పశైలి రూపాలు, బయటి అలంకరణలు ఇంకా నిలుపుకొని ఉన్న ఏకైక ఆలయం. ఇక్కడ దొరికిన శిల్పాలు అమరావతి శైలిలోని సున్నపురాయి కళాప్రతిమలు.ఇక్కడ దొరికిన తల లేని తీర్ధంకరుని శిల్పాన్ని బట్టి గొల్లత్తగుడి జైన ఆవాసము వీరశైవుల దాడికి గురైందని చెప్పవచ్చు.
గొల్లత్తగుడి పురావస్తు శాఖ వారు 1958-59లోనూ, 1970 నుండి 1975వరకు రెండు విడతల త్రవ్వకాలు జరిపారు.చరిత్రకారుల ప్రకారం ఇక్కడ ఆసియాలోనే అతి పెద్దవైన మహిళ, పురుషుల పాదాలున్నాయి. ఈ పాదాల పొడవు 6.4 మీ, వెడల్పు సుమారు 3 మీటర్లు
పూడూరు (గద్వాల):
పూడూరు, మహబూబ్ నగర్ జిల్లా, గద్వాల మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 509125. గద్వాలకు ఆగ్నేయాన 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చారిత్రక ప్రాశస్త్యం కల గ్రామము. నల సోమనాద్రి గద్వాలలో కోటను నిర్మించకముందు పూడూరు రాజధానిగా పాలించాడు. చాళుక్యుల కాలంలో కూడా ఈ గ్రామము సామంత రాజధానిగా ఉండేది. ఈ గ్రామం తొమ్మిదవ శతాబ్దాన అత్యున్నత స్థితిలో ఉన్నట్లు ఇక్కడ లభించిన ఓ కన్నడ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ గ్రామంలోని మల్లికార్జునస్వామి దేవాలయం నందలి శాసనంలో ' పుండ్రె సంజ్ఞ పురె దుర్గె యశస్సోదరె ' అను సంజ్ఞ వలన దీని పూర్వనామం "పుండ్రపురం" గా ప్రసిద్ధి చెందినట్లు తెలుస్తుంది. ఈ గ్రామం చుట్టూ వలయాకారంలో దుర్గం ఉండేది. అది ఇప్పుడు ద్వంసం అయింది. అక్కడక్కడ ఎత్తైన శిథిల దిబ్బలుగా దర్శనమిస్తుంది.గ్రామంలో జైన సంస్కృతి ఆనవాళ్ళు:
ఈ గ్రామం ఒకప్పుడు జైనులకు ప్రధాన స్థావరంగా ఉండి, 12 వ శతాబ్ధిలో జైన, శైవ సంఘర్షణలకు యుద్ధరంగంగా నిలిచినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ గ్రామంలోని మల్లికార్జునస్వామి దేవాలయానికి సమీపంలోని కోటగోడకు ఉన్న కొన్ని విగ్రహాలలో తలపై ఏడు పడగల సర్పం కలిగి ధ్యానముద్రలో ఆసీనుడై ఉన్న జైన తీర్థంకరుని విగ్రహం ఉంది. ప్రధానమైన ఈ విగ్రహంతో పాటు మరో మూడు తీర్థంకరుల విగ్రహాలు కూడా ఉన్నాయి. మల్లికార్జునుని గుడి దగ్గర కూడా చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలలో పార్శ్వనాథుని విగ్రహం, మరో రెండు తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ గుడి దగ్గర ఓ నల్లని రాతిపై మూడు వైపుల 12 వ చాళుక్య విక్రమ సంవత్సరం నాటి కన్నడ శాసనం ఉంది. ఈ శాసనంలో కూర్చొని ఉన్న ధ్యాన జైన విగ్రహం, జైనుని ప్రశంస, పల్లవ జినాలయ ప్రశంస కనిపిస్తుంది. అదే విధంగా వీరభద్రాలయం దగ్గర ఉత్తరం వైపు ఉన్న సత్రానికి సంబంధించిన గోడపై ఓ రాతి మీద నాలుగు వరుసలలో కొన్ని శిల్పాలను మలిచారు. మొదటి వరుసలో శివలింగంతో పాటు ధ్యాన జైన విగ్రహం కనిపిస్తుంది. ఈ వీరభద్రాలయం పూర్వం జినాలయంగా ఉండి, వీరశైవం విజృంభించిన కాలంలో ధ్వంసమై శివాలయంగా మారినట్లు డాక్టర్ మారేమండ రామారావు అభిప్రాయపడ్డారు. పల్లవుల కాలంలో త్రిభువనమల్ల విక్రమాదిత్యుని సామంతుడు హల్లకరాసు పుదూరులోని పల్లవ జినాలయ జైనగురువు కనకసేన భట్టారకునికి ఒక సాగులోనున్న భూమిని దానం చేశాడు.
No comments:
Post a Comment