Sunday, 12 April 2015

ఆదిలాబాదు జిల్లా

ఆదిలాబాదు జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఒకటి. దీని ముఖ్యపట్టణం ఆదిలాబాదు.బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును ఎడ్లవాడ అని పిల్చేవారు. ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇదిఒకటి.

జిల్లా పేరు వెనుక చరిత్ర:

అదిలాబాదు జిల్లాకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద వచ్చింది.మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్ధిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్ధికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది.

జిల్లా చరిత్ర:

చారిత్రకంగా అదిలాబాదు జిల్లా పలు సంస్కృతులకు పుట్టిల్లు. దక్షిణభారతదేశ సరిహద్దులలో ఉపస్థితమై ఉన్న కారణంగా ఇది ఉత్తరభారతదేశ సామ్రాజ్యాధినేతలైన ముగలాయిలు, మౌర్యులు, దక్షిణ భారతదేశ సామ్రాజ్యాధినేతలైన శాతవాహనులు మరియు చాళుక్యులు పాలించారు. ప్రస్థుతం ఈ జిల్లా ప్రజలలో పొరుగున ఉన్న మరాఠీ సంప్రదాయం రాష్ట్ర తెలుగు సంప్రదాయంతో గుర్తించ తగినంతగా కలిసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ జిల్లాలో, పలు సంస్కృతులకి చెందిన వారైన బెంగాలి, మళయాళీ మరియు గుజరాతీలు,పరస్పర సహకార జీవనం సాగిస్తున్నారు.

భౌగోళిక స్వరూపం:

ఆదిలాబాదు జిల్లాకు ఉత్తరంలో మహారాష్ట్రంలోని యవత్మాల్ జిల్లా, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున చంద్రాపూర్ జిల్లా ఉంది, దక్షిణాన నిజామాబాద్ జిల్లా, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. నదులుపరంగా దక్షిణాన గోదావరి నది, తుర్పున ప్రాణహిత నది, ఉత్తరంలో వార్ధా నది, పెల్ గంగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 16203.8 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం పరంగా రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉంది. జిల్లాలో 40 శాతం ఉండే అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి. జిల్లాలో 75% భూభాగం ఉష్ణమండల తేమతోకూడిన అడవులతో నిండి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అటవీప్రాంతం కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉంది. అదిలాబాదు జిల్లాలో కుంతల జలపాతాలు, సహ్యాద్రి కొండలు మరియూ సత్మాల కొండలు అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, సానిటరీ పైపులు, ఇటుకలు, బెంగుళూరు పెంకుల తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది. ఈ జిల్లాలోని ప్రధాన నదులు ప్రాణహిత, పెన్‌గంగ మరియు వార్థా.

వ్యవసాయం:

ఆదిలాబాదు జిల్లాలో అధికంగా సాగుచేయబడే ఆహారపు పంట జొన్నలు, వడ్లు, మొక్కజొన్నలు, కందులు, మినుములు, సోయాబీన్, ఇతర పప్పులు, మిరపకాయలు, గోధుమలు, చెరకు. వాణిజ్యపంటలు పత్తి, పసుపు. నిర్మల్, లక్షింపేట్, ఖానాపూర్ సమీప మండలాలలో నీటిపారుదల వసతులు లభ్యం ఔతున్న కారణంగా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. 3.5% భూమిలో సాగుచేయబడే ఉద్యానవన సాగుబడి వలన విదేశీమారకం వంటి ఆదాయం మరియు ఉపాధి లభిస్తుంది. సాధారణ వర్షపాత ప్రాంతం అలాగే నీటిపారుదల వసతులు స్వల్పంగా కలిగిన ఎగువ భూములలో ఉద్యానవన సాగుబడికి అనుకూలంగా ఉండి కూరగాయలు, పండ్లు, కూరగాయలు అలాగే సుగంద ద్రవ్యాలు, పూలు వంటి పంటలు కూడా పండుతున్నాయి.

పట్టుపురుగుల పెంపకం కూడా జిల్లాకు కొంత ఆదాయం సమకూరుస్తుంది. పట్టుపురుగుల పెంపకం కొరకు 1000 ఎకరాలలో మలబరీ చెట్లు పెంచబడుతున్నాయి. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం కొరకు అనుకూల వాతావరణం ఉంది కనుక పట్టుపురుగుల పెంపకం అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ ప్రణాళిక కారణంగా జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకం వలన ఆదాయం మరియు ఉపాధి లభిస్తుంది. జిల్లాలోఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు పెంచబడుతున్నాయి. జిల్లాలో భూపరిస్థితి పెంపుడు జంతువుల పెంపకానికి అనుకులంగా ఉంది. జిల్లాలో 87 పశువుల ఆసుపత్రులు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో ఉన్న పచ్చిక నిండిన కొండ ప్రాంతాలు గొర్రెలు, మేకలు పెంచడానికి అనుకూలంగా ఉంది.

పరిశ్రమలు:

ఆదిలాబాదు జిల్లాలో బియ్యపు మిల్లులు, నూనె శుద్ధి కర్మాగారాలు, మొక్కజొన్న పిండి, శక్తినిచ్చే ఆహరపదార్థాలు, మినపప్పు మిల్లులు, సుగంధద్రవ్య పొడులు, బేకరీలు, ఐస్ క్రీం, అల్లం ముద్ద, సేమ్యా, మిరపకాయల కారం, నూడుళ్లు, బిస్కత్తులు, కాగితపు రుమాళ్ల తయారీ, ఊరగాయలు, అప్పడాలు, వేరుశనగ బర్ఫీ, పశుగ్రాసం, వ్యవసాయం, వ్యవసాయ సంభంధిత పరిశ్రమలు జిల్లాలో ఉపాధి కల్పిస్తున్నాయి. ముడి మరియు నాణ్యత పెంచబడిన తోలు, తోలు సంచులు, తోలు చెప్పులు, తోలు వస్తువులు తయారీ ఉపాధిని కలిగిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, అల్లికలు, పాఠశాల సమవస్త్రాలు, ఉపయోగానికి సిద్ధమైన దుస్తులు, స్క్రీన్ ప్రింటింగ్, వస్త్ర పరిశ్రమ సంభంధిత పరిశ్రమలున్నాయి. ప్లాస్టిక్ సంచులు, ఎలెక్ట్రానిక్ పరికరములు, గాజులు పూసలు, టైర్లు తయారీ పరిశ్రమలున్నాయి. సిమెంటి ఇటుకలు, మట్టి ఇటుకల తయారీ పరిశ్రమలు కూడావున్నాయి. బ్లాక్ & వైట్ ఫెనిలిజ్, బట్టలుతుకు పొడి తయారీ చేస్తున్నారు. పుస్తకాలు, ఆభినందన పత్రికలు, వివాహ పత్రికలు తయారు చేస్తున్నారు. శుద్ధనీరు తయారీ, డేటా ప్రొసెసింగ్, అల్యూమినియం పాత్రలు, ఫర్నీచర్, సైబర్ కేప్స్, యంత్రాలు మరమ్మత్తు పనులు వంటివికూడా వున్నాయి

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు:

ఆదిలాబాదు జిల్లాలోని ఐదు డివిజన్లుగా 52 రెవిన్యూ మండలాలుగా విభజించినారు.
డివిజన్లు పేర్లు ఆదిలాబాదు, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల్.
 ఆదిలాబాదు లోక్‌సభ స్థానం : ప్రస్తుత ప్రతినిధి: గెడం నగెష్శాసనసభ స్థానాలు (10):
సిర్పూర్ :కోనేరు కొన్నప్ప, తెరాస
చెన్నూర్ :నల్లాల ఓదెయ్య, తెరాస
బెల్లంపల్లి :దుర్గం చిన్నయ్య, తెరాస
మంచిర్యాల :యన్ . దివాకర్ రావు , తెరాస
ఆసిఫాబాద్ :కొవ లక్ష్మి,తెరాస
ఖానాపూర్ :రెఖాశ్యాం నాయక్ , తెరాస
ఆదిలాబాదు :జోగు రామన్న - తెరాస,
బోధ్ :ఆర్ బపురావ్, తెరాస
నిర్మల్ :ఇంద్రకరన్ రెడ్డి , తెరాస
ముధోల్ :విఠల్ రెడ్ది , తెరాస

స్థానిక స్వపరిపాలన:

జిల్లాలో 1743 గ్రామాలు 866 గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మరియు పట్టణ ప్రాంతాలకొరకు ఏడు పురపాలక సంఘాలున్నాయి. పురపాలక సంఘాల పేర్లు: ఆదిలాబాదు, మంచిర్యాల్,,బెల్లంపల్లి,మందమర్రి.నిర్మల్,భైంసా, కాగజ్‌నగర్

రవాణా వ్యవస్థ:

2003లో విభాలుగా విభజించిన రైల్వేశాఖలో దక్షిణమధ్య రైల్వే లోని హైదరాబాదు విభాగానికి చెందిన ముద్ఖేదు స్టేషన్ అదిలాబాదులో ఉంది. హైదరాబాదు రైల్వేశాఖను రెండు భాగాలుగా విభజించిన తరువాత అదిలాబాదు నాందేడ్ విభాగంలో చేరుతుంది. ఇక్కడి నుండి హైదరాబాదు, నిజామాబాదు, నాందేడు, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాట్నా, నాగపూరు, నాసిక్, ముంబాయి, వరంగల్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, ఔరంగాబాదు, మన్మద్, గుల్బర్గా, బీదర్, బీజపుర్, షోలాపూరు మొదలైన ఊర్లకు హైదరాబాదు ద్వారా నేరు రైళ్ళు ఉన్నాయి.క్రిష్ణా ఎక్స్ ప్రెస్ అదిలాబాదు కు ఒక ప్రధాన రైలు.

దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. ఇక్కడ వాయుమార్గం 1948లో జరిగిన పోలీస్ ఏక్షన్ భారతీయ వాయు సేనలచేత నాశనం చేయబడింది. అతిసమీపంలో ఉన్న విమానశ్రయం నాగపూరులో ఉన్నా హైదరాబాదు విమానాశ్రయం మరింత ఉపయోగకరమైనది.
జనాభా లెక్కలు

1981 జనాబా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాబా... 16,39,003, వీరిలో స్త్రీ పురుషుల నిష్పత్తి990:1000, అక్షరాశ్యత: 18.97 శాతం.

2011 జనాభాగణాంకాలను అనుసరించి అదిలాబాదు జిల్లా జనసంఖ్య 27,37,738. వీరిలో పురుషులు 51%, స్త్రీలు 49%. అదిలాబాదు సరాసరి అక్షరాస్యత 80.51%. ఇది జాతీయ అక్షరాస్యతకు అధికమైనది. పురుషుల అక్షరాస్యత 88.18%. స్త్రీల అక్షరాస్యత 72.73%. ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్నా వారి శాతం 14%. అధికారిక భాష తెలుగు. తెలుగును ఎక్కువ మంది మాట్లాడుతారు. ఇక్కడ వాడుకలో ఉన్న ఇతర భాషలు మరాఠీ, ఉర్ధూ. జిల్లాలో అత్యధికులు హిందూ మతానికి చెందిన వారు. ముస్లిముల సంఖ్య గుర్తించతగిన స్థాయిలో ఉంది.

నిర్మల్ బొమ్మలు:

ఆదిలాబాదు జిల్లాలో అడవులు అధికంగా ఉన్నాయి కనుక ఇక్కడ గిరిజన సంస్కృతి నేటికీ వర్ధిల్లుతూనే ఉంది. ఒకప్పటి సంస్కృతిని చాటి చెప్పే కోటలు, కట్టడాలు, గుళ్ళూ, చెక్కిన రాళ్ళు, ఇకా సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. నిర్మల్ బొమ్మలు ప్రసిద్ధి గాంచినవి,

పశు పక్ష్యాదులు:

ఆదిలాబాదు జిల్లా అరణ్యాలను రెండు విభాగాలుగా ఉంటుంది. ఎగువ బాగంలో తాలుక్, నల్లమద్ది, బిజసల్, చైర్మను, విప్ప, జిత్రేగి, ముష్టి వంటి వృక్షసంపద ఉంది. దిగువ భాగంలో ఉసిరి, మారేడు, మౌదుగు, వెదురు, సారపాపు వంటి వృక్షసంపద ఉంది. ఆదిలాబాదు జిల్లా దట్టమైన అరణ్యప్రాంతంలో పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, హైనాలు, తోడేళ్ళు మరియు అడవి కుక్కలు వంటి జంతువులు నివసిస్తున్నాయి. అలాగే అరణ్య మైదానాలలో అలాగే పక్షి జాతులలో నెమలి, పావురాళ్ళు, అడవి కోళ్ళు, రామ చిలుకలు, మైనాలు ఉన్నాయి. నీలి ఆవులు, చుక్కల జింకలు మరియు సంబార్ వంటి సాదు జంతువులు నివసిస్తున్నాయి.


బాసరలో సరస్వతీ మందిరము

జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 70 కి.మీ దూరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక సరస్వతీ ఆలయం ఇక్కడే ఉంది. భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరు లో ఉండగా, రెండవది ఇదే. ఇక, నిర్మల్ పట్టణం చిత్రకళకు ప్రసిద్ధి గాంచింది. కుంటాల జలపాతం చాలా ఆకర్షణీయమైంది. పులి, మొసళ్ళు, దుప్పి వంటి అడవి జంతువుల సంరక్షణకోసం "ప్రాణహిత సంరక్షణ కేంద్రం" ఏర్పాటు చేయడం జరిగింది.

 దర్శనీయ ప్రదేశాలు: 

బాసర, పోచంపాడు, నిర్మల్, కుంతల జలపాతం, కడెం ప్రాజెక్టు, బెల్లంపల్లి,మందమర్రి, సిర్పూర్, బుగ్గ రాజేశ్వరాలయం, కొకసమన్నూరు హనుమాన్ ఆలయం. ఎచోడా, నారాయణస్వామి ఆలయం, జైనాధ్

ప్రముఖ వ్యక్తులు

కొమురం భీమ్
రాంజీ గోండు
కొండా లక్ష్మణ్ బాపూజీ
సముద్రాల వేణుగోపాలచారి

1 comment:

  1. Your Affiliate Profit Machine is ready -

    And making money online using it is as simple as 1--2--3!

    Follow the steps below to make money...

    STEP 1. Tell the system what affiliate products the system will push
    STEP 2. Add push button traffic (it ONLY takes 2 minutes)
    STEP 3. Watch the system explode your list and sell your affiliate products all on it's own!

    Do you want to start making money??

    Click here to start running the system

    ReplyDelete